తమిళ హీరోలు సూర్య, కార్తీలు ఈరోజు సింహచలం లోని సింహద్రి అప్పన్నను దర్శించుకున్నారు.. కార్తీ నటించిన చినబాబు మూవీ ఆడియో రిలీజ్ వేడుకు ఈ రోజు సాయంత్రం విశాఖలోని సి ఆర్ రెడ్డి కాన్వేకేషన్ హాలులో జరగనున్నది.. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సూర్య బ్రదర్స్ చిత్ర యూనిట్ తో పాటు విశాఖ చేరుకున్నారు..అనంతరం వారు సింహచలంకు వెళ్లారు.. అక్కడ వారికి ఆలయ మర్యాదలతో అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు.. ఆ తర్వాత అప్పన్నను దర్శించుకున్నారు.. ఈ సందర్భం గా ఆలయ అధికారులు వారికి తీర్ధప్రసాదాలను అందజేశారు..