అర్జున్ రెడ్డి చిత్రంతో భారీ క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. కేవలం నటుడిగానే కాకుండా తను చేపడుతున్న వినూత్న కార్యక్రమాలతో అభిమానుల మనసులు గెలుచుకుంటున్నాడు . ఇటీవల తన బర్త్ డే సందర్భంగా మండు వేసవిలో ఐస్ క్రీమ్ లు పంచిపెట్టి ప్రశంసలు అందుకున్నాడు . ఇక రీసెంట్ గా జరిగిన ఫిలిం ఫేర్ అవార్డు వేడుక కోసం సంగారెడ్డి జహీరాబాద్ కి చెందిన ప్రశాంత్ అనే ఎంబిఏ కుర్రాడికి తను వేసుకున్న కాస్ట్యూమ్స్ లాంటివే కుట్టించి అతనికి మేకప్ చేయించి ఈవెంట్ కి తీసుకెళ్లాడు. ఫిలిం ఫేర్ అవార్డు వేడుకలోను ఆ వ్యక్తిని తన పక్కనే కూర్చోబెట్టుకొని ఆ వ్యక్తికి జీవితంలో మరచిపోలేని అనుభూతిని మిగిల్చాడు. ఫిలింఫేర్ అవార్డ్ వేడుకలో అర్జున్ రెడ్డి చిత్రానికి గాను ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న విజయ్ దేవరకొండ, ఆ అవార్డుని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించాడు. అవార్డుని వేలం వేసి వచ్చిన సొమ్ముని పేదలకి ఇవ్వాల్సిందిగా కేటీఆర్ని కోరారు. దీనికి స్పందించిన కేటీఆర్ తొలి అవార్డ్ని మంచి పనికోసం ఇవ్వడం ప్రశంసనీయం అంటూ విజయ్ కోరికని తీరుస్తానని మాట ఇచ్చారు. ఇప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీలు జూహీ చావ్లా, రిచా చద్దా, శిఖ తలసానియా తదితరులు విజయ్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. నటీనటుల జీవితంలో అవార్డులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కానీ విజయ్ తీసుకున్న నిర్ణయం అంతకంటే గొప్పదదని వారంటున్నారు. కొత్తదనంతో ముందుకు వెళుతున్న విజయ్ దేవరకొండ రానున్న రోజులలో ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేసి అభిమానుల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. విజయ్ నటించిన అర్జున్ రెడ్డి చిత్రం తమిళంలో వర్మ పేరుతో రీమేక్ అవుతుంది. హిందీలోను ఈ మూవీని రీమేక్ చేయాలని భావిస్తున్నారు.