స్వర్ణ ప్రొడక్షన్స్ పతాకం ఫై ఆమోగ్ దేశపతి ,అర్చన ,శ్రేయవ్యాస్ హీరో హీరోయిన్ లు గా పార్సిల్ ఫెమ్ షెరాజ్ దర్శకత్వంలోలయన్ సాయి వెంకట్ సమర్పణలో పి. వి. సత్యనారాయణ నిర్మించిన హారర్ థ్రిల్లర్ మరియు లవ్ ఎంటర్ టైన్మెంట్ మూవీ చిత్రంషాలిని’ ఇటీవల ఈ చిత్రం యొక్క పాటలు శివరంజని మ్యూజిక్ ద్వారా విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడం తో సోమవారం సాయంత్రం ప్రసాద్ లాబ్ లో ఈ చిత్రం ప్లాటినం డిస్క్ ని రంగ రంగ వైభవంగా చిత్ర యూనిట్ సభ్యులు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకౄఎష్ణ గౌడ్,తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సినీ నటి కవిత, నిర్మాత.. లయన్ సాయి వెంకట్, ప్రొడ్యూసర్ మోహన్ గౌడ్, సెన్సార్ బోర్డ్ మెంబర్ అట్లూరి రామకౄఎష్ణ తిరుమల తిరుపతి దేవస్థానం ఎ. వి. వి .సురేష్ మొదలగు వారు హాజరయ్యారు. ప్లాటినం డిస్క్ షీల్డ్ లను ప్రతాని రామకౄఎష్ణ గౌడ్, కవిత చేతులు మీదగా చిత్ర యూనిట్ సబ్యులకు అందచేశారు. సమర్పకుడు సాయి వెంకట్ మాట్లాడుతూ సెన్సార్ పూర్తి చేసుకున్న ఇందులో హార్రర్ ఎక్కువగా ఉండడం తో సెన్సార్ వాళ్ళు సర్టిఫికెట్ అన్నారు దాంతో మేము రీజనల్ కు వెళ్ళాము అక్కడ జీవిత రాజశేఖర్ గారు మాకు సహాయం అందించారు. ఇక ఈ చిత్ర పాటల విషయానికి వస్తే అల్రెడీ శివరంజని మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలు లక్షల మ్యస్ ను పొందింది. టైటిల్ సాఫ్ట్ అయినా సినిమా మాత్రం భయపెడుతుంది. అన్నారు. దర్శకుడు షెరాజ్ మాట్లాడుతూ నిర్మాత సత్యనారాయణ తో ఇది నా రెండో సినిమా.ఈ కథ చెప్పిన వెంటనే ఒకే చెప్పారు . హర్రర్ ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చుతుంది. డిఫరెంట్ మూవీ ప్రతి క్షణం ఉత్కంఠ కలిగిస్తుంది. చిత్ర హీరో ఆమోగ్ దేశపతి మాట్లాడుతూ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు థాంక్స్ ఈసినిమా చిన్న సినిమా పెద్ద సినిమా కాదు ఒక మంచి సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు. షెరాజ్ తో నాకు రెండో సినిమా ఈ కథ చెప్పిన వేటనే ఒక చేసాను. పిలవగానే ఈ పంక్షన్ కి వచ్చినందుకు అందరికి కౄఎతఙ్ఞతలు ఈ సినిమాను సెప్టెంబర్ ఒకటి న విడుదల చేస్తున్నాము అన్నారు చిత్ర నిర్మాత.