ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజుగారూ.. ఎందుకీ తొందర?

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 05, 2018, 10:07 AM



టాలీవుడ్ లో పక్కా ప్లానింగ్ తో వరసగా సినిమాలు నిర్మించుకుంటూ వెళ్లే బెస్ట్ ప్రొడ్యూసర్లలో ఒకరు దిల్ రాజు. అన్ని లెక్కలు వేసుకుని ఆచితూచి సినిమా నిర్మాణం స్టార్ట్ చేస్తారు. ఆయన జడ్జిమెంట్ పై ఇండస్ట్రీలో చాలామందికి మంచి నమ్మకం ఉంది. ఆయన డిస్ట్రిబ్యూటర్ గా ఫెయిల్యూర్లు బోలెడు చూసినా నిర్మాతగా మాత్రం అవి తక్కువే. 


దిల్ రాజు ప్రొడక్షన్ లో లేటెస్ట్ గా శ్రీనివాస కళ్యాణం మూవీ ఫైనల్ స్టేజ్ లో ఉంది. నితిన్ హీరోగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టెయినర్ ను ఆగస్టులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆనెల 9న ఈ మూవీ వస్తుందని ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. దీంతోపాటు దిల్ రాజు సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఉగాదికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఫలానా నెలలో ఈ సినిమా వస్తుందని ప్రకటిస్తే సరిపోయేదానికి డేట్ తో సహా అనౌన్స్ చేయడం దిల్ రాజు కు తన ప్లానింగ్ పై ఉన్న నమ్మకమే కారణమని చెప్పొచ్చు. 


కానీ దిల్ రాజు ప్లానింగ్ వెనుక ఇంకో రీజన్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఆయన చాలా ఎర్లీగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నాడంటే ఆ టైంకు థియేటర్లు ముందే బ్లాక్ అవుతాయని సిగ్నల్ ఇవ్వడమే అంటున్నారు. అయితే నైజాం.. ఉత్తరాంధ్రలో మేజర్ థియేటర్లు ఆయన చేతిలోనే ఉన్నాయి. కాబట్టి థియేటర్లు దొరకవన్న కంగారేం లేదు. అలాంటప్పుడు  మరీ ఇంత తొందర ఎందుకు రాజుగారూ






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com