యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న తాజా చిత్రం ‘సాక్ష్యం’. శ్రీవాస్ ఈ మూవీకి దర్శకుడు. ఈ చిత్రం పంచభూతాలు అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రూపొందుతోంది. ఈ మూవీ ఈ నెల 20వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుకను ను ఈరోజు సాయంత్రం నిర్వహించనున్నారు.. దీనికోసం హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికను సిద్దం చేస్తున్నారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకి.