‘కుమారి 21’ ఎఫ్ తో టాలీవుడ్లో మెరిసిన హెబ్బాపటేల్.. ఆ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్తో మరిన్ని అవకాశాల్ని సొంతం చేసుకుంది. ‘ఈడో రకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లాంటి సినిమాలు పర్వాలేదనిపించుకున్నా ఆ తర్వాత అమ్మడికి వరస పరాజయాలు ఎదురవడంతో హెబ్బాపటేల్కి సౌత్లో గడ్డు పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం ఈ హాట్ భామ 24 కిసెస్ మూవీలో నటిస్తున్నది.. మిణుగురులు మూవీతో హిట్ కొట్టిన ఆయోధ్య కుమార్ ఈ మూవీకి దర్శకుడు.. అదిత్ ఈ మూవీలో హీరో..ఈ మూవీ టీజర్ ను ఈరోజు సాయంత్రం హీరోయిన్ ఇలీయానా చేతుల మీదుగా చిత్ర యూనిట్ విడుదల చేయనుంది.