`లక్ష్మీకల్యాణం, నేనే రాజు నేనే మంత్రి` చిత్రాల తర్వాత కాజల్ అగర్వాల్ తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అనీల్ సుంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. కాజల్ కోసం తేజ సరికొత్త పాత్రను డిజైన్ చేశాడట. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కాజల్ కనపడుతుందట. ఈ చిత్రంలో సోనూసూద్ కూడా విలన్గా నటిస్తున్నాడు. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్, సోనూసూద్ అన్నదమ్ములుగా కనిపిస్తారట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్టయ్యింది. ఎన్టీఆర్ బయోపిక్ యన్.టి.ఆర్.. వెంకీ చిత్రాల నుండి తేజ డ్రాప్ అయిన తర్వాత చేస్తున్న చిత్రమిది.