వివాదాస్పద నటి శ్రీరెడ్డి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సినీప్రముఖుల టార్గెట్ గా ఆమె సంచలన ఆరోపణలు కొనసాగుతున్నాయి. కాస్టింగ్ కౌచ్, సెక్స్ రాకెట్ విషయంలో శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతితెలిసిందే. ఆరోపణలు చేస్తోంది కానీ ఆధారాలు బయట పెట్టడం లేదనే విమర్శని శ్రీరెడ్డి ఎదుర్కొంటోంది. తాజగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ప్రముఖ హీరో, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్ పై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు పెను ప్రకంపనలు సృష్టించే విధంగా ఉన్నాయి. లారెన్స్ అసలు రంగు ఇదే అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది.ఓరోజు తాను తన స్నేహితుల ద్వారా లారెన్స్ మాస్టర్ ని గోల్కొండ హోటల్ లో కలుసుకున్నానని శ్రీరెడ్డి తెలిపింది. అక్కడ జరిగిన విషయాలని శ్రీరెడ్డి వివరించడం సంచలనంగా మారింది. నిన్నటి నుంచి శ్రీరెడ్డి తమిళ నటుల్ని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
లారెన్స్ తనని హోటల్ రూమ్ కి తీసుకుని వెళ్ళాడు. అక్కడా రాఘవేంద్ర స్వామి ఫోటో, రుద్రాక్షలు చూశా. నాకు చాలా సంతోషంగా అనిపించింది. నెమ్మదిగా లారెన్స్ నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు.తాను పేద కుటుంబం నుంచి వచ్చానని కొత్తవారికి సాయం చేయాలనే తపన తనలో ఉందని లారెన్స్ తనతో చెప్పాడు. లారెన్స్ చాలామంది అనాధ పిల్లలకు ఆశ్రయం కల్పించిన విషయం కూడా నాకు బాగా నచ్చింది.కానీ నెమ్మదిగా అతడి అసలు రంగు బయట పడింది. అతడు నా నుంచి ఏమి కోరుకుంటున్నాడో నెమ్మదిగా అర్థం అయిందని శ్రీరెడ్డి తెలిపింది.నెమ్మదిగా తన బొడ్డు, నడుము చూపించాలని అడిగాడు. అంతటితో అతడి ఉద్దేశం నాకు అర్థం అయింది. అంతే కాదు అద్దం ఎదురుగా రొమాంటిక్ డాన్స్ చేయాలని అడిగాడు. వెంటనే నాతో రొమాన్స్ మొదలు పెట్టాడు.నీకు నా చిత్రంలో ఆఫర్ ఖాయం అని చెప్పాడు. ఆ తరువాత అతడితో కొంతకాలం ఫ్రెండ్ షిప్ చేశాను. కానీ అవకాశం మాత్రం రాలేదని శ్రీరెడ్డి తెలిపింది.ఈ మొత్తం ఎపిసోడ్ లో చివరకు విలన్ గా మారింది బెల్లంకొండ అంటూ శ్రీరెడ్డి పరోక్షంగా కామెంట్స్ చేసింది. లారెన్స్ చిత్రం గంగ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించారు.