ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఠాగూర్ మ‌ధు చేతికి పందెంకోడి 2

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 13, 2018, 12:35 PM



త‌మిళ హీరో విశాల్ ఇటీవల చేసిన ‘ఇరుంబు తిరై’ తమిళనాట ఘన విజయాన్ని సాధించింది. తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో వచ్చిన ఈ సినిమా ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా తరువాత విశాల్ నుంచి ‘సెండై కోళి 2’ రానుంది. లింగుస్వామి దర్శకత్వంలో గతంలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన ‘సెండై కోళి’ (పందెం కోడి)కి ఇది సీక్వెల్. కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ సినిమాను దీపావళికి విడుదల చేయాలనే ఆలోచనలో విశాల్ వున్నాడు .. ఈ సినిమాకి ఆయనే నిర్మాత. తమిళనాట దీపావళికి సూర్య .. విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. అయినా పోటీని లెక్కచేయకుండా విశాల్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకున్నాడు .. అక్టోబర్ 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇక ఈ మూవీ తెలుగు అనువాద రైట్స్ ను నిర్మాత ఠాగూర్ మ‌ధు ద‌క్కించుకున్నారు.. పందెంకోడి 2 పేరుతో ఆయ‌న ఈ మూవీని విడుద‌ల చేయున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com