బాహుబలితో బారతదేశ బాక్స్ ఆఫీస్ ని బద్ధలుకొట్టిన ప్రభాస్ ఆ సినిమా కోసం ఐదేళ్లు కష్టపడ్డ సంగతి తెలిసిందే. ఆ షూటింగ్స్ లో రాజుల కోటలో యుద్ధ సన్నివేశాల్లో నిర్విరామంగా కష్టపడి ఎట్టకేలకు ఊహించిన దానికంటే ఎక్కువ విజయన్నే అందుకున్నాడు. అందుకు రాజమౌళి కూడా మెయిన్ పిల్లర్ అని చెప్పుకోవాలి. అయితే ఆ తర్వాత ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాను ఎప్పుడు మొదలు పెడతాడో అని ఎదురుచూసిన వారందరికీ ఒక గుడ్ న్యూస్ దొరికింది.
ఎట్టకేలకు ప్రభాస్ ప్రభాస్ సాహో షూటింగ్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేశాడు. హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో 5 కోట్లతో నిర్మించిన ఓ భారీ సెట్ లో సన్నివేశాల్ని చిత్రీకరించాడానికిి రెడీ అయ్యాడు దర్శకుడు సుజిత్. ప్రభాస్ కూడా ఈ సెట్ లో నిర్విరామంగా కొన్ని రోజుల పాటు షూటింగ్ లో బిజీగా గడపనున్నాడట. ఐదేళ్ల వరకు ఫుల్ గా బాహుబలి మూడ్ లో ఉన్న ప్రభాస్ ఈ సారి ఫుల్ యాక్షన్ తరహా చిత్రంతో రాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తన ఫేస్ బుక్ లో ప్రకటించి ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఎక్సయిట్ చేస్తున్నాడిప్పుడు.
దాదాపు 150 కోట్లతో యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ని కూడా ప్రభాస్ కు జోడిగా ఫిక్స్ చేశారు. తెలుగు-తమిళ్ మరియు హిందీ భాషల్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ కూడా వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకులను అందించాలనుకుంటున్నాడు. చూడాలి మరి సాహో తో ప్రభాస్ ఇంకెన్ని రికార్డులు బద్దలుకొడతాడో.