ఇటీవల సమ్మోహనం చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ని తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం నన్ను దోచుకుందువటే చిత్రంతో బిజీగా సంగతి తెలిసిందే. బాలీవుడ్లోను పలు చిత్రాలు చేసిన ఆయనకి సరైన గుర్తింపు లభించలేదు. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన సమ్మోహనం చిత్రంతో సుధీర్ బాబుకి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఆయన తదుపరి చిత్రాలపై అభిమానులలో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈ హీరో ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వంలో నన్ను దోచుకుందువటే అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇటీవల చిత్ర ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. ఈ పోస్టర్ ఫ్యాన్స్లో సినిమాపై ఆసక్తిని కలించింది. తాజాగా టీజర్ విడుదల చేశారు. స్టీలర్ పేరుతో విడుదలైన టీజర్లో సుధీర్ బాబు కాస్త డిఫరెంట్ మెంటాలిటీ ఉన్న మేనేజర్ పాత్రలో కనిపిస్తుండగా, హీరోయిన్ నబా నటేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కనిపించింది. కీలక పాత్రల్లో నాజర్, వేణులు నటిస్తున్న ఈ సినిమాకు అజనీష్ బి లోకనాథ్ సంగీతమందిస్తున్నారు . ఇటీవల సొంత ప్రొడక్షన్ హౌజ్ స్థాపించిన సుధీర్ బాబు తన నిర్మాణ సంస్థలో తొలి చిత్రంగా నన్ను దోచుకుందువటే సినిమా చేస్తున్నాడు.