ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద‌యం లేవ‌గానే అమ్మే క‌నిపిస్తుంది : జాన్వీ

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 14, 2018, 03:35 PM



ధడక్‌’ చిత్రం  విడుదలయ్యాకా అందరూ నన్ను అమ్మతో పోల్చిచూస్తారు. దాని గురించి నాకు అంతగా చింతేమీ లేదు. ఆమె కూతురుగా పుట్టాను కాబట్టి నేనూ ఆమెలాగానే కనిపిస్తున్నాను అని తెలిపింది జాన్వీ క‌పూర్‌. అమ్మ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. అమ్మపై ఆమె అభిమానులు చూపిస్తున్నంత ప్రేమకు రుణం తీర్చుకోవడానికి నా నటనతో కొంచెమైనా మెప్పిస్తాననే నమ్మకం ఉంది. నాకంటూ ఓ గుర్తింపు సాధించుకోవడానికి నాకు గొప్ప అవకాశం దక్కింది. నాకు తెలిసి అమ్మలా ఇంకెవరూ లేరు…రారు. ఓ నటికి ప్రేక్షకుల నుంచీ ఎంత ఆదరణ, ప్రేమాభిమానాలు దక్కుతాయో అంతకంటే చాలా ఎక్కువే అమ్మకు దక్కింది. అమ్మ లేని లోటు తీర్చలేనిది. చాలా విషయాల్లో స్పష్టంగా తెలుస్తోంది. కష్టమైనా ఆ ఆలోచన నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాను. కానీ వీలుకావడం లేదు. చివరిదాకా అమ్మ జ్ఞాపకాలు నాతోనే ఉంటాయి. అమ్మ చేసే కొన్ని పనులు నా మనసులో బాగా నాటుకుపోయాయి. రోజూ ఉదయం లేవగానే అమ్మ పళ్లరసం తాగేది. నిద్రలేవగానే నాకు అదే దృశ్యం కళ్లముందు కనబడుతుందని చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com