ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెల్ బోర్న్ ఫెస్టివల్ కి మహానటి నామినేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 16, 2018, 04:28 PM



సావిత్రి జీవితచరిత్ర .. మహానటిగా తెరకెక్కి ఎంతోమంది అభిమానుల మనసులను కదిలించివేసింది. దర్శకుడిగా నాగ్ అశ్విన్ .. సావిత్రి పాత్రను పోషించిన కీర్తి సురేశ్ నూటికి నూరు మార్కులు కొట్టేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా ఘన విజయాన్ని సాధించి తన ప్రత్యేకతను చాటుకుంది. అలాంటి ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివెల్ ఆఫ్ మెల్ బోర్న్ కు నామినేట్ అయింది. కీర్తి సురేశ్ ప్రధానపాత్రను పోషించిన ఈ సినిమా, ఉత్తమ చిత్రం .. ఉత్తమ నటి .. ఉత్తమ సహాయ నటి కేటగిరీల్లో పోటీపడుతోంది. ఈ విషయాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ .. ఆనందాన్ని వ్యక్తం చేశారు. 'మహానటి' విదేశాల్లోను ఆదరణ పొందుతున్నందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఉత్తమనటి కేటగిరీలో దీపికా పదుకొనే (పద్మావత్) .. అలియా భట్ (రాజీ) .. రాణీముఖర్జీ (హిచ్ కీ) .. విద్యాబాలన్ (తుమ్హారీ సులు) తో కీర్తి సురేశ్ పోటీపడనున్నారు. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఆగస్టు 10 నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com