యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, హాట్ బ్యాటీ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం సాక్ష్యం. అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకుడు. ఈ క్రేజీ యాక్షన్ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయనున్నారు. ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ సినిమా చాలా కొత్తగా ఉండనుంది. అన్నీ కమర్షియల్ అంశాలు జోడించి, ప్రకృతిని కేంద్రబిందువుగా రూపొందుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది.. ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం అని తెలిపాడు.
ఇతర పాత్రల్లో జగపతిబాబు, శరత్కుమార్, మీనా, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, లావణ్య తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం ఆర్థర్ ఎ.విల్సన్, మాటలు సాయిమాధవ్ బుర్రా, సంగీతం హర్షవర్థన్.