ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కన్ను కన్ను కలిశాయి అనే పాట టీజర్‌ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 19, 2017, 01:25 PM



హైదరాబాద్‌: ‘కన్ను కన్ను కలిశాయి.. ఎన్నో ఎన్నో తెలిశాయి’ అంటున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘పైసా వసూల్‌’. పూరీ జగన్నాథ్‌ దర్శకుడు. శ్రియ, ముస్కాన్‌ సేథి, కైరాదత్‌ కథానాయికలు. ఈ చిత్రంలోని ‘కన్ను కన్ను..’ అనే పాట టీజర్‌ను శనివారం విడుదల చేశారు. దీన్ని చిత్ర బృందం సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది.


‘‘పైసా వసూల్‌’ కేవలం మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా భావిస్తున్న వారి కోసం ఈ మెలోడీ సాంగ్‌ అని పేర్కొంది. యూత్‌ఫుల్‌ బాలయ్య, బ్యూటిఫుల్‌ శ్రియ.. అనూప్‌ రూబెన్స్‌ స్వరపరిచిన ఈ పాటలో సందడి చేశారని చెప్పింది. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనంద ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 1న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.





 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com