ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తో రానున్న రాజశేఖర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 21, 2018, 12:04 PM



సీనియర్ హీరో డా . రాజశేఖర్ చాల రోజుల తరువాత గత ఏడాది ‘గరుడ వేగ ‘సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఈచిత్రంలో ఆయన నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటించి మెప్పించాడు


 ఇక ఈ సినిమా తరువాత ఆయన మరో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రంలో నటించనున్నారు. ‘అవె’ ఫెమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్న ఈచిత్రంలో ఆయన పోలీస్ పాత్రలో నటించనున్నారు . ప్రస్తుతం ప్రశాంత్ తమన్నా కథనాయికగా హిందీ క్వీన్ చిత్రం ను తెలుగులో ‘దటీస్ మహాలక్ష్మి’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసి త్వరలోనే రాజశేఖర్ తో తెరకెక్కించనున్న చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com