వైవిధ్యభరిత చిత్రాలు చేస్తున్నప్పటికీ నితిన్కు మంచి విజయం దక్కడం లేదు. ఈ తడవైనా మంచి విజయాన్ని చేజిక్కించుకోవాలని ఎదురు చూస్తున్నారు. లై, ఛల్ మోహన్రంగ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం ఆయనకు నిరాశను కలిగించింది. ఈ నేపథ్యంలో నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం శ్రీనివాస కల్యాణంపై ఆయన ఎన్నో అంచనాలతో ఉన్నారు. సతీష్ వేగేశ్న (శతమానం భవతి ఫేమ్) దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. ఆగస్ట్ తొమ్మిదో తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ నేపథ్యంలో ఈ నెల 22వ తేదిన ఆడియో రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు.. ఈ వేడుకలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు.. నితిన్ సరసన రాశీఖన్నా నాయికగా నటిస్తోంది.