ఢిల్లీలో పుట్టి పెరిగిన పాయల్ రాజ్పుత్ ప్రస్తుతం ముంబైలో ఉంటున్నది. పంజాబీ సినిమాలు, సీరియళ్లలో నటించింది.2017లో సైరాత్ సినిమాను పంజాబీలో చన్నా మేరేయా పేరుతో రీమేక్ చేశారు. ఆ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇదే ఈమె నటించిన మొదటి సినిమా.యాక్టింగ్ కోర్సులో డిప్లొమా చదివింది పాయల్.సప్నోన్సే భారే నైనా సీరియల్లో మీనాక్షి పాత్ర చేసి తన నట జీవితాన్ని ప్రారంభించింది పాయల్. ఇప్పటి వరకూ ఎనిమిది సీరియళ్లలో నటించింది.
పంజాబీలో జోర్డాన్ సందు సరసన హాంజీ హాంజీ సినిమాలో నటిస్తున్నది. ఆగస్టు చివరి వారంలో ఆ సినిమా కూడా విడుదల కానున్నది.ప్యాడ్మ్యాన్ చాలెంజ్లో తనవంతుగా పాల్గొని ప్రచారం కూడా చేసింది.చిన్ననాటి స్కూలు మిత్రుడు సౌరభ్ థింగ్రాతో రిలేషన్షిప్లో ఉన్నది. చిన్నప్పటి నుంచీ నటిగా రాణించాలనుకుంది. అనుకున్నట్టు నటిగా కెరీర్ ప్రారంభించి
విజయవంతంగా ముందుకెళ్తున్నది.మూగజీవాలంటే ఇష్టం. ఇప్పటికే రెండు కుక్కల్ని పెంచుకుంటున్నది.