అంజలి, జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి అద్భుత సినిమా లలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పేరొందిన బేబీ షామిలి హీరోయిన్ గా ఓయ్ చిత్రం తో తెలుగు పరిశ్రమకు అడుగు పెట్టిన విషయం విదితమే... అయితే ఈమె ప్రస్తుతం మంచి నిర్మాతగా పేరొందలని ప్రయతింస్తోందట.. అదేంటని ఆశ్చర్య పోతున్నారా? అవునండి మీరు చదువుతున్నది నిజమే.. సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తారామణులు ఎవరైనా టాప్ హీరోయిన్ అయిపోవాలనుకుంటారు కానీ మన బేబీ మాత్రం హీరోయిన్ కు బిన్నంగా
నిర్మాత గా మారాలనుకొంటోందట. సినిమాకు సంబంధించిన విద్యను నేర్చుకోవడానికి అమెరికాకు వెళ్లిన షామిలి చెన్నైకి తిరిగొచ్చిన తరువాత మళ్లీ నటనపై దౄఎష్టి సారించారు. తొలుత తెలుగులో నాయకిగా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ కెరీర్కు ఆ చిత్రం పెద్దగా హెల్ప అవ్వలేదు. ఆ తరువాత కోలీ వుడ్లో విక్రమ్ప్రభుకు జంటగా వీరశివాజీ చిత్రంలో నటించారు. ఈ చిత్రం నిరాశనే మిగిల్సింది. దీంతో తాజాగా తెలుగులో నటిస్తూ మరోసారి తన అదౄఎష్టాన్ని పరిక్షించుకోనున్నారు. అయితే షామిలి మనసులో దర్శకత్వం ఆలోచనలు తొలచేస్తున్నాయట. తాను నేర్చిన దర్శకత్వ ప్రతిభను ప్రదర్శించడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. ఈ అమ్మడు ఇప్పటికే నాలుగైదు కథలను తయారు చేసుకున్నారట. ఈ సారి గనుక కథానాయకిగా సక్సెస్ కాలేక పోతే మంచి నిర్మాత గా అయినా గుర్తింపు పొందాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిస్తోంది... ఇటు హీరోయిన్ అటు దర్శత్వం లో నిరుత్సాహం ఎదురైతే ఇక అదే చేస్తానంటోంది... మన బేబీ షామిలి.