శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మహేష్ బాబు, కొరటాల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ’భరత్ అను నేను’ శ్రీమంతుడు సినిమా లో ఒక ఊరిని దత్తత తీసుకునే పాత్రలో కనిపిస్తే ఇప్పుడు భరత్ అను నేను చిత్రం లో ఏకంగా ముఖ్యమంత్రి పాటలో కనిపించున్నాడు ప్రిన్స్. ఈ చిత్రంలో మహేశ్కి బాలీవుడ్ బ్యూటీ కైరా అడ్వాణీ జోడీ కడుతుండగా ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా అటుంచితే ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను ఉత్తర్ప్రదేశ్లోని మూసాబాఘ్, జహంగీరాబాద్ ప్యాలెస్ వంటి చరిత్రాత్మక ప్రాంతాల్లో చిత్రీకరించాలని చిత్రబౄఎందం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యం లోనే చిన్న చిక్కొచ్చి పడింది. ఈ చిత్రీకరణకు ఏఎస్ఐ(ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా)అధికారులు ఒప్పుకోలేదట. యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించే క్రమంలో భవనాలు దెబ్బతినే అవకాశం ఉందని అందుకే షూటింగ్కి ఒప్పుకోలేదని చిత్రవర్గాల సమాచారం.