తారక్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం తెరకెక్కుతుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్ర టీజర్ను విడుదల చేశారు. తారక్ కత్తి పట్టుకుని పరిగెడుతున్న తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా.. మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎలా ఉంటాదో తెలుసా.. మట్టి తుఫాను చెవిలో మోగితో ఎట్టుంటాదో తెలుసా.. అని జగపతిబాబు చెప్తున్న డైలాగ్ పవర్ఫుల్గా ఉంది. ‘కంటపడ్డానా కనికరిస్తానేమో..వెంటపడ్డావో నరికేస్తావోబా..’ అంటూ తారక్ చెప్తున్న డైలాగ్ అదిరిపోయింది. ఇందులో తారక్కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.