ప్రియాంక.. నీకీ జోనస్ ల వ్యవహారం చాలా రోజుల నుంచి ట్రెండ్ అవుతున్నా.. పీసీ మాత్రం క్లారిటీ ఇవ్వడంలేదు. ఎంగేజ్మెంట్ విషయాన్ని ఎందుకని అంత గోప్యంగా ఉంచుతున్నదో ఎవరికీ అర్ధం కావడం లేదు. అమెరికన్ మీడియా సంస్థలు పీసీ ఎంగేజ్మెంట్ అయినట్టుగా చెప్తున్నా.. నో కామెంట్ అంటున్నది. ఇది తన సొంత విషయం అని పబ్లిక్ కు చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నది. సల్మాన్ ఖాన్ భారత్ సినిమా నుంచి బయటకు రావడంతో..పీసీపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఇటీవలే ప్రియాంక చోప్రా, ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇచ్చిన పార్టీకి హాజరైంది. 1990 ప్రాంతంలో టాప్ హీరోయిన్ గా పాపులరైన రవీనా టాండన్ తో కలిసి సెల్ఫీ దిగింది. ఈ ఫోటోను రవీనా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఫొటోలో ప్రియాంక వెలికి ఖరీదైన ఎంగేజ్మెంట్ ఉంగరం ఉంది. ప్రియాంక పుట్టినరోజున నికి జోనస్ ఈ రింగ్ తొడిగినట్టుగా మీడియా వర్గాలు కోడైకూశాయి. దీని ధర ఇంచుమించుగా రూ.2 కోట్ల వరకు ఉంటుందట. ఎంతైనా కాస్టలీ జంట కదా మరి. ఇప్పటికైనా ప్రియాంక తన ఎంగేజ్మెంట్ విషయాన్ని బయటపెడితే సరి లేదంటే.. దీనిపై ఇంకా రూమర్లు వస్తూనే ఉంటాయి.