తెలుగు పరిశ్రమలో ఇప్పుడు హాట్ టాపిక్ సినిమా దివంగత నటుడు, నట సార్వభౌముడు ఎన్టీఆర్ బయోపిక్.ఈ సినిమా బాధ్యతలు తేజ నుండి దర్శకుడు క్రిష్ చేతులలోకి మారగానే ఈసినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు షెడ్యూల్ కి ఒకరు చొప్పున కొత్తగా నటులని సినిమాకి జోడిస్తూ ఆసక్తి రేకెత్తిస్తున్నారు. స్వాతంత్రదినోత్సవాన్ని పురష్కరించుకొని పోస్టర్ రిలీజ్ చేసిన యూనిట్ ఇప్పుడు కొత్తగా మరొక పేరుని తెరమీదకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ సినిమాలో బసవతారకంగా విద్యాబాలన్ నటిస్తుండగా.. సావిత్రిగా కీర్తి సురేష్.. శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. చంద్రబాబుగా నారా నటిస్తుండగా.. ఇప్పుడు మరొక పాత్రగా జయప్రద పాత్రలో రాశిఖన్నాను ఎంపిక చేసుకున్నారు.