ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాల్ ‘పందెంకోడి 2’ వచ్చేస్తుంది

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 20, 2018, 11:19 AM



తెలుగు వాడే అయినా తమిళంలో స్టార్ డం తెచ్చుకున్న కథానాయకుడు విశాల్. తనకి స్టార్ డం తెచ్చిన తొలి సినిమా పందెం కోడి. ఈ సినిమాతోనే తెలుగులో కూడా సక్సెస్ అయ్యాడు. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దాదాపు పన్నెండేళ్ల తర్వాత సీక్వెల్ వస్తుంది. పందెంకోడిలో మీరాజాస్మిన్ కథానాయకిగా నటించగా పందెంకోడి 2 లో కీర్తి సురేష్ కథనాయకి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని అక్టోబర్ 18 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు. శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి మరో కథానాయకిగా నటిస్తున్న ఈ సినిమాను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com