యాక్షన్ హీరో గోపీచంద్ కెరీర్ లో తొలిసారి లాయర్ గా నటిస్తున్న చిత్రం పక్కా కమర్షియల్. మారుతి డైరెక్షన్లో రూపొందిన ఈ యాక్షన్ కామెడీ చిత్రంలో రాశిఖన్నా హీరోయిన్ గా నటించింది. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ, ప్రపంచవ్యాప్తంగా జూలై 1వ తేదీన విడుదలవనుంది. ఈ మేరకు మూవీ టీం మొత్తం వారం రోజులనుండి వరస ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ, సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నారు.
ప్రచారంలో భాగంగా, పక్కా కమర్షియల్ మూవీ టీం రేపు ప్రేక్షకులతో కలిసి లైవ్ ఇంటిరాక్షన్ సెషన్ లో పాల్గొననున్నారు. రేపు ఉదయం పదకొండు గంటలకు విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్లో, సాయంత్రం ఆరు గంటలకు శ్రీరామ థియేటర్లో ఈ సెషన్లు జరగబోతున్నాయని తెలుపుతూ మేకర్స్ అఫీషియల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.