కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ "జెంటిల్ మెన్". యాక్షన్ కింగ్ అర్జున్, మధుబాల జంటగా నటించగా, ఏఆర్ రెహ్మాన్ సంగీతమందించారు. ARS ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ పై కేటీ కుంజుమోహన్ నిర్మించారు. 1993లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు నిర్మాత కుంజుమోహన్. ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ ఒక్కొక్కటిగా ఇస్తూ సినిమాపైన అంచనాలను మరింత పెంచేస్తున్నారు.
జెంటిల్ మెన్ ఫిలిం ఇంటెర్నేషనల్ బ్యానర్ పై ఏ. గోకుల్ కృష్ణ జెంటిల్ మెన్ 2 ని డైరెక్ట్ చేస్తారని ఇటీవలే ప్రకటించిన కుంజుమోహన్ తాజాగా ఈ సినిమా ఆర్ట్ వర్క్ కోసం సీనియర్ ఆర్ట్ డిజైనర్ తోట తరణి ని, అదనంగా ఆయన కూతురు రోహిణి ని కూడా రంగంలోకి దించినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలో నయనతార చక్రవర్తి, ప్రియాలాల్ హీరోయిన్లు కాగా, ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది నుండి షూటింగ్ జరుపుకోనుంది.