ప్రముఖ ఒడియా సినీ నటుడు రాయ్ మోహన్ పరిదా (58) శుక్రవారం భువనేశ్వర్లోని ప్రాచి విహార్ ప్రాంతంలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విచారణ ప్రకారం ఇది ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాయ్ మోహన్ ఒడిశాలోని కియోంజర్ జిల్లాకు చెందినవాడు మరియు అనేక హిట్ సినిమాలో నటించారు. రామ లక్ష్మణ్, నాగ పంచమి, ఉదండి సీత,సింఘా బహిని వంటి సినిమాలో అయన కీలక పాత్రలు పోషించారు.