నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన సినిమా 'కార్తికేయ 2'. ఈ సినిమాకి చందు ముండేటి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది.తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాకి కాలభైరవ సంగీతం అందించారు. ఈ సినిమాలో ఆదిత్య మీనన్, హర్ష చెముడు,శ్రీనివాస రెడ్డి, అర్జున్ కొలిశెట్టి కీలక పాత్రలో నటించారు.ఈ సినిమా జూలై 22న విడుదల కానుంది.