సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై వివాదాస్పద ట్వీట్ చేశారు. 'ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరు? మరి ముఖ్యంగా కౌరవులు అంటే ఎవరు? ' అంటూ ఆయన చేసిన ట్వీట్ వైరల్గా మారింది. బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్లోని అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై ఫిర్యాదు నమోదైంది. చీప్ పబ్లిసిటీ కోసం ఆర్జీవీ ఇలాంటి పనులు చేయడం దారుణమని బీజేపీ ఎంపీ జీవీఎల్, ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.