ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రికార్డు స్థాయి థియేటర్లలో విడుదలవుతున్న "పక్కా కమర్షియల్"

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 28, 2022, 06:32 PM



కెరీర్లో తొలిసారి అత్యధిక స్క్రీన్ లలో తన సినిమాను విడుదల చేస్తున్నాడు హీరో గోపీచంద్. మారుతి డైరెక్షన్లో గోపీచంద్, రాశిఖన్నా జంటగా నటించిన ఈ చిత్రం ఓవర్ సీస్ లో జూన్ 30వ తేదీ నుండి ప్రీమియర్ షోలు జరుపుకుంటుంది. గోపీచంద్ ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాలలోకెల్లా పక్కా కమర్షియల్ సినిమా ఓవర్సీస్ లో అత్యధికంగా 217 థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా తెలిపింది.
పక్కా కమర్షియల్ సినిమాను గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించగా, జెక్స్ బిజోయ్ సంగీతం అందించారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో జూలై 1వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రం పట్ల భారీ అంచనాలు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com