వెండితెరపై ఎంత అలరించినా అప్పుడప్పుడూ తెర బయట సందడి చేయడం చాలా ముఖ్యం. ఆ గొప్ప అవకాశం హీరోయిన్స్ కి ఫ్యాషన్ షోలతో దక్కుతుంది. ముంబయిలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో నిమ్మపండు రంగు గౌను ధరించి వయ్యారంగా నడిచి తన అందంతో భారతీయ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్. ఆమె సొగసులు చూసి ప్రేక్షకులు సంబరంతో గోల చేసేశారు. ఉత్సాహం రెట్టింపు చేసే వాతావరణం… ఇంతమంది మోడల్స్… మధ్యలో నేను అంటూ ట్వీట్ చేసింది సుస్మిత. ఆమెతో పాటు బాలీవుడ్ భామ దిశాపటానీ గులాబీ రంగు లెహంగాలో మెరిసింది.