నందమూరి తారకరత్న, మేఘ శ్రీ జంటగా చాందిని క్రియేషన్స్ పతాకంపై శివప్రభు దర్శకత్వంలో నాగరాజు నెక్కంటి తెలుగు,కన్నడ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం `అమృత వర్షిణి`. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో ఈరోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన హీరో నారా రోహిత్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, మరో హీరో శ్రీకాంత్ కెమెరా స్విచాన్ చేశాడు.
అనతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో నందమూరి తారకరత్న మాట్లాడుతూ…“ అభిరుచి ఉన్న దర్శక నిర్మాతలు కావడంతో పాటు , కథ నచ్చడంతో సినిమా చేస్తున్నాను. ఇంటెన్స్ ఉన్న స్టోరి . అన్ని రకాల ఎమోషన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కమర్షియల్ ఎంటర్ టైనర్ `అమృత వర్షిణి`. మంచి టీమ్ కుదిరారు. సినిమా పై చాలా హోప్స్ తో ఉన్నాం“ అన్నారు.