థ్రిల్లర్ కథాశంతో రూపొందుతున్న చిత్రం ‘కవచం’. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 7న విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెహ్రీన్ మరో హీరోయిన్గా నటించింది. హర్షవర్థన్ రాణ, నీల్ నితిన్ ముఖేష్ ఇతర ముఖ్యపాత్రధారులు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. చోటా కె.నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని (నాని) నిర్మిస్తున్నారు.