ఇటలీలో సింధి, కొంకణి సంప్రదాయాల్లో తమ వివాహాన్ని వైభవంగా జరుపుకున్న బాలీవుడ్ సెలబ్రిటీ జంట దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ లు, ఈ ఉదయం ముంబై తిరిగి వచ్చారు. మిలన్ నుంచి బయలుదేరిన వారు ఎక్కిన విమానం ఉదయం 8 గంటల ప్రాంతంలో ముంబైలో ల్యాండ్ అయింది. సంప్రదాయ దుస్తులు ధరించి వచ్చిన వారిని చూసేందుకు, ఫోటోలు తీసేందుకు పోటీ పడ్డారు. షేర్వానీపై ఎరుపు రంగు జాకెట్ ధరించిన రణ్ వీర్, బంగారు వర్ణంలో ఉన్న సిల్క్ పంజాబీ సూట్ ను దీపిక ధరించి కనిపించారు. ఎయిర్ పోర్టు అధికారులు ఈ జంటతో సెల్ఫీలు దిగాలని కోరగా, వారు అంగీకరించి, కాసేపు సెల్ఫీలు దిగారు. ఎయిర్ పోర్టులో దిగిన వీరు నేరుగా రణ్ వీర్ నివాసానికి వెళ్లగా,వారికి సంప్రదాయ రీతిలో బంధుమిత్రులు స్వాగతం పలికారు.