పద్మశ్రీ అల్లు రామలింగయ్య శతజయంతి అక్టోబర్ 1 సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ నేతృత్వంలో అల్లు రామలింగయ్య పేరిట నిర్మించిన 'అల్లు స్టూడియోస్' ఫిల్మ్ స్టూడియోని మెగాస్టార్ చిరంజీవి శనివారం ఉదయం ప్రారంభించారు. అల్లు రామలింగయ్య పేరిట ఇచ్చే జాతీయ అవార్డుతో పాటు ఆయన పేరిట పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం హైదరాబాద్ పార్క్ హయత్లో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ ఏడాది అల్లు రామలింగయ్య జాతీయ అవార్డు ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్కు అందుకున్నారు. గతంలో దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నటుడు కోట శ్రీనివాసరావు ఈ అవార్డును అందుకున్నరు.