ప్రస్తుతం మహేష్ బాబు ‘మహర్షి’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.ఇప్పటికే ఈ సినిమా 75% షూటింగ్ పూర్తి చేసుకుంది.మిగతా భాగం వంశీ పైడిపల్లి జనవరి చివరికల్లా ముగించనున్నారట.ఇక మహేష్ బాబు తదుపరి సినిమా సుకుమార్ తో చేయనున్నారని తెలిసిన విషయమే.కాకపోతే కథ ఇంకా ఫైనలైజ్ కాలేదు.తాజాగా సుక్కు మహేష్ కు లైన్ వినిపించారట.క్రైమ్ థ్రిల్లర్ తరహాలో ఈ కథ ఉంటుందట.
ఈ లైన్ మహేష్ కి నచ్చడంతో స్క్రిప్ట్ రెడీ చేయమని సుకుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.జనవరి చివరికల్లా పూర్తి స్క్రిప్ట్ తో మహేష్ ని కలుస్తానని సుకుమార్ చెప్పారట.
చూస్తుంటే సుకుమార్ సినిమా ‘మహర్షి’ విడుదలకు ముందే సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తుంది.మహేష్ తో సుకుమార్ కి ఇది రెండవ సినిమా,మొదటి సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేక పోయింది.దీంతో సుకుమార్ బ్లాక్ బస్టర్ కథతో రానున్నారట.