లాస్ఏంజెల్స్: గ్లోబల్స్టార్ ప్రియాంక చోప్రా 69వ ఎమ్మీ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొనబోతోంది. సోమవారం లాస్ఏంజెల్స్లోని మైక్రోసాఫ్ట్ థియేటర్లో ఎమ్మీ అవార్డ్స్ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని స్టీఫెన్ కోల్బర్ట్ హోస్ట్ చేయబోతున్నారు. ఇందులో ప్రముఖ హాలీవుడ్ నటులు రీస్ విదర్స్పూన్, నికోల్ కిడ్మన్లతో కలిసి ప్రియాంక ఈ టీవీ అవార్డులను అందజేయనుంది. గతేడాది ప్రియాంక నటించిన అమెరికన్ టెలివిజన్ సిరీస్ క్వాంటికో ఎమ్మీకి నామినేట్ అయింది. ఈ సందర్భంగా ప్రియాంక కార్యక్రమానికి హాజరైంది. కానీ ఈసారి క్వాంటికోకు ఎలాంటి నామినేషన్లు దక్కలేదు. అయినా ఆమెకు పిలుపురావడం విశేషం. ప్రస్తుతం ప్రియాంక క్వాంటికో మూడో సీజన్లో నటిస్తోంది. అంతేకాకుండా.. ఎ కిడ్ లైక్ జేక్, ఇజింట్ ఇట్ రొమాంటిక్ చిత్రాల్లోనూ నటిస్తోంది.