సినిమా ప్రమోషన్స్కి బిగ్ బాస్ షో మంచి ఫ్లాట్ ఫాంగా మారింది. రానా, తాప్సీ, అల్లరి నరేష్, సునీల్ వంటి స్టార్స్ బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్లి కంటెస్టెంట్లతో సరదాగా గడిపారు. తమ సినిమా విశేషాలను తెలియజేస్తూ మూవీని ఫుల్ ప్రమోట్ చేసుకున్నారు. ఇక సెప్టెంబర్ 21న జై లవకుశ చిత్రం విడుదల కానుండగా, ఈ మూవీ టీం కూడా బిగ్ బాస్ షోతో తమ సినిమాను భారీగా ప్రమోట్ చేసుకోవాలని భావిస్తుంది. తొలిసారి ఎన్టీఆర్తో కాలు కదిపిన రాశీ ఖన్నా, నివేదా థామస్లు సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ రోజు బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటర్ అయినట్టు తెలుస్తుంది. సినిమాకి సంబంధించిన విషయాలు, ఎన్టీఆర్తో ఎక్సీపీరియెన్స్ తదితర వివరాల గురించి హౌజ్మేట్స్ తో చర్చించనున్నారు. ఈ షో త్వరలోనే టెలికాస్ట్ కానుంది. కళ్యాణ్ రామ్ నిర్మించిన జై లవకుశ చిత్రం బాబీ దర్శకత్వంలో తెరకెక్కగా, దసరాకి ఈ చిత్రం పసందైన విందు అందించనుందని అభిమానులు భావిస్తున్నారు.