టాలీవుడ్ నవమన్మధుడు నాగ్ అప్ కమింగ్ మూవీ రాజుగారి గది 2. 2016లో వచ్చిన ప్రీతమ్ అనే మలయాళ మూవీ బేస్ చేసుకొని రాజుగారిగది 2 చిత్రాన్ని తెరకెక్కించారని తెలుస్తుండగా, ఇందులో నాగార్జున మెంటలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. సమంత ఆత్మగా కనిపించనుంది. ప్రీతమ్ సినిమాని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మార్చి తెరకెక్కిస్తుండగా, మలయాళ చిత్రంలో జయసూర్య పోషించిన పాత్రని తెలుగులో నాగ్ చేస్తున్నాడట. ఓంకార్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుండగా, సీరత్ కపూర్, సమంతలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
పీవీపి సినిమా మరియు ఓఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా రాజుగారిగది 2 చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అక్టోబర్ 13న ఈ మూవీని విడుదల చేయనుండగా, తాజాగా చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు. ఇందులో నాగ్ మానసిక వైద్యుడిగా అదరగొట్టాడు. బీచ్ రిసార్ట్ ముగ్గురు ఫ్రెండ్స్, ఆత్మ, మెంటలిస్ట్ ల మధ్య జరిగే హరర్ కామెడీ చిత్రంగా రాజుగారిగది 2 రూపొందింది. ఇక ట్రైలర్ ని బట్టి చూస్తుంటే ఓంకార్ మరోసారి తన టేకింగ్ ఏంటో నిరూపించుకున్నాడని అనిపిస్తుంది. ప్యాచ్ వర్క్ మినహా చిత్ర షూటింగ్ అంతా కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది.