ప్రముఖ ఛానెల్లో ప్రస్తుతం ఎన్టీఆర్ హోస్ట్గా అలరిస్తున్న కార్యక్రమం బిగ్ బాస్ సీజన్ 1 మరికొద్ది రోజులలో పూర్తి కానుంది. దీని తర్వాత బిగ్ రియాలిటీ డ్యాన్స్ షో పేరుతో ఓ కార్యక్రమం మొదలు కానుందని, దీనికి రేణూదేశాయ్ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ కార్యక్రమం స్టార్ ప్లస్లో వస్తున్న నాచ్ బలియే తరహాలో ఉంటుందని , ఈ కార్యక్రమానికి రేణూతో పాటు గ్లామర్ భామ ఆదాశర్మ, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ న్యాయ నిర్ణేతలుగా ఉంటారని టాక్. ఆదాశర్మ హార్ట్ ఎటాక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర కాగా, సోషల్ మీడియాలో రెగ్యులర్గా పోస్ట్లు పెడుతూ అభిమానులకి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ అమ్మడికి కథక్ నృత్యంతో పాటు వెస్ట్రన్ డ్యాన్స్లోను మంచి నైపుణ్యం ఉంది. అందుకే ఈ అమ్మడిని జడ్జ్గా ఎంపిక చేసారని టాక్. ఇక జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు రియాలిటీ షోస్కి జడ్జ్గా వ్యవహరించిన ఈయన స్టార్హీరోలకి కూడా కొరియోగ్రాఫర్గా పనిచేశారు. ఇక ఈ కార్యక్రమానికి హోస్ట్గా బుల్లితెర సీనియర్ యాంకర్ హోస్ట్గా వ్యవహరించనున్నట్టు తెలుస్తుంది.