హైదరాబాద్: ఇదో రేర్ ఫోటో. బాలీవుడ స్టార్ ప్రియాంకా చోప్రా.. నోబెల్ బహుమతి గ్రహీత యూసుఫ్జాయి మలాలా.. ఓ అరుదైన సందర్భంలో కలుసుకున్నారు. న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలు జరుగుతున్నాయి. అక్కడ ఈ ఇద్దరు హేమాహేమీలు తారసపడ్డారు. ఆ సందర్భాన్ని ఇలా ఫోటోలో బంధించారు. యునిసెఫ్కు గుడ్విల్ అంబాసిడర్గా ప్రియాంకా చోప్రా.. యూఎన్ మెసెంజర్ ఆఫ్ పీస్గా మలాలా ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఈ ఇద్దరూ బాలికల విద్యపై చర్చించేందుకు యూఎన్ సమావేశాలకు హాజరయ్యారు. అయితే చర్చలు ముగిసిన తర్వాత సెల్ఫీ దిగారు. చోప్రాను కలిసిన మలాలా స్టన్ అయ్యింది. ఇది నేను నమ్మలేకపోతున్నాను అంటూ మలాలా ట్వీట్ చేసింది. ప్రియాంకా చోప్రా కూడా తన ఇన్స్టాగ్రామ్లో మలాలాతో దిగిన ఫోటోను పోస్ట్ చేసింది.