ప్రేమమ్ లో మలర్ పాత్రతో మళయాళంలో... ఫిదా సినిమాలో భానుమతి పాత్రతో తెలుగులో సాయి పల్లవి ప్రేక్షకులను మైమరపింపజేసింది. ఫిదాలో ఆమె నటనకు.. డైలాగ్ డెలివరీకి.. డ్యాన్సులకు మొత్తం తెలుగు వాళ్లంతా ఫిదా అయిపోయారు. అప్పటినుంచి ఆమెకు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చిపడినా వాటిలో చాలావాటికి సీరియస్ గా నో చెప్పేసింది. ఆచితూచి చాలా సెలక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తానని కచ్చితంగా చెప్పేసింది.
ఫిదా సినిమా విజయం వెనుక శేఖర్ కమ్ముల దర్శకత్వ ప్రతిభ ఎంతో ఉంది. కానీ అనుకోని విధంగా క్రెడిట్ మొత్తం సాయి పల్లవి అకౌంట్ లోకి వెళ్లిపోయింది. ఈ సినిమా విజయం తలకెక్కడంతో ఇప్పుడు ఆమె ఎవరినీ కేర్ చేయడం లేదట. రీసెంట్ గా తన సహజ నటనతో పేరుతెచ్చుకున్న యంగ్ హీరోతో చేస్తున్న సినిమాలో అంతా తనిష్టం అన్నరీతిలో వ్యవహరించడంతో ఆ హీరో ఆమెపై చిరాకు పడిపోయాడట. షూటింగ్ కు లేటుగా రావడం.. అదేమని అసిస్టెంట్ డైరెక్టర్లు అడిగినా సమాధానం ఇవ్వకపోవడంతో చిత్ర యూనిట్ అవాక్కవ్వాల్సి వచ్చింది. దీనికితోడు ఆ హీరోతో సాయిపల్లవికి మాటామాటా తేడా వచ్చి.. చివరకు సెట్స్ నుంచి మధ్యలోనే వెళ్లిపోయాడని టాక్.
ఈ గొడవలో తప్పెవరది అన్నదానిపై ఇంకా క్లారిటీ రాకపోయినా సాయిపల్లవి తీరుపై మరికొన్ని విమర్శలు లేకపోలేదు. సాయిపల్లవి టాలెంటెడ్ యాక్టర్ అన్నది ప్రేమమ్ తోనే అందరికీ తెలిసింది. ఇండస్ట్రీలో రాణించడానికి టాలెంట్ ఒక్కటే సరిపోదు. అయినా ఒక్క సినిమాకు అంతా నా ఇష్టం అన్నట్టుంటే కష్టమని.. ఇది ఆమె కెరీర్ కు ఏమంత మంచిది కాదని టాలీవుడ్ ఇన్ సైడ్ టాక్.