టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన బోల్డ్ కంటెంట్ సినిమా 'అర్జున్ రెడ్డి' పై నార్త్ జనాలు ఇప్పుడిపుడే మాట్లాడుకుంటున్నారు. హిందీలో ఈ సినిమాను కబీర్ సింగ్ గా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ - కీయారా అద్వానీ నటిస్తున్న ఈ సినిమాను ఒరిజినల్ దర్శకుడు మన సందీప్ రెడ్డి వంగ మరోసారి డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే చిత్రానికి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు నార్త్ లో వైరల్ గా మారింది.
కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఢిల్లీ యూనివర్సిటీ కిరోరి మాల్ కాలేజ్ లో ఇటీవల షూటింగ్ నిర్వహించగా కాలేజ్ స్టూడెంట్స్ మొబైల్ లో సీన్స్ షూట్ చేశారు. అలాగే షూటింగ్ స్పాట్ లో ఫొటోలు కూడా తీసి హీరో హీరోయిన్స్ లుక్ ని ఇంటర్నెట్ లో పెట్టేశారు. చిత్ర యూనిట్ కాస్త కంగారు పడినా కూడా కొంతవరకు ఈ సినిమాకు ఇప్పుడే కాస్త బజ్ క్రియేట్ అయ్యింది.
ఎందుకంటే షాహిద్ - కీయారా యొక్క లిప్ కిస్ సీన్ సోషల్ మిడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. అసలు అది షూటింగ్ లా లేదు అంటూ పలువురు నెటీజన్స్ అనుమానాలు వచ్చేలా కామెంట్స్ చేస్తున్నారు. ఇక యూ ట్యూబ్ ఛానెల్స్ అయితే కాంట్రవర్సీ క్రియేట్ అయ్యలే టైటిల్స్ ఇచ్చేస్తూ నానా రచ్చ చేస్తున్నాయి. ముద్దు పెట్టుకుంటూ దొరికిపోయిన హీరో హీరోయిన్ అంటూ హంగామా చేస్తున్నారు.