కైరా అద్వానీ, షాహిద్ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం కబీర్ సింగ్. తెలుగులో ఘానా విజయం సాధించిన అర్జున్ రెడ్డికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. తెలుగు వర్షన్ ని తెరకెక్కించిన సందీప్ వంగానే ఈ చిత్రానికి కూడా దర్శకుడు. సందీప్ వంగా ఈ చిత్రాన్ని నార్త్ ఆడియన్స్ అభిరుచికి అనుగుణంగా తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి లీకేజి సమస్య తప్పడం లేదు. ఈ చిత్రంలో కీలక మైన సన్నివేశాల ఫుటేజ్ లీక్ అయి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.ప్రస్తుతం కబీర్ సింగ్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఢిల్లీ యూనివర్సిటీ పరిసరాల్లో హీరో హీరోయిన్లపై వచ్చే రొమాంటిక్ సన్నివేశాల్ని దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. కైరా అద్వానీ, షాహిద్ కపూర్ మేడపై ఏకాంతంగా గడుపుతున్న సన్నివేశాలు, బైక్ పై రొమాన్స్, పార్క్ లలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న దృశ్యాలు లీక్ అయి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
యూనివర్సిటీ ప్రాంతం కావడంతో షూటింగ్ చూసేందుకు స్టూడెంట్స్ అంతా ఎగబడ్డారు. తమ మొబైల్ ఫోన్స్ లో కైరా అద్వానీ, షాహిద్ కపూర్ నటిస్తున్న సన్నివేయాలని షూట్ చేశారు.ఇంతవరకు ఈ చిత్ర టైటిల్ మినహా మరేది ప్రకటించలేదు. షాహిద్ కపూర్, కైరా లుక్ లీక్ అయిపోవడంతో చిత్ర యూనిట్ కొంత నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. థియేటర్స్ లో ఆడియన్స్ కు వినోదాన్ని అందించాల్సిన సన్నివేశాలు ముందే బయటకు రావడంతో దర్శకుడు ఇకపై జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నాడు. అర్జున్ రెడ్డి చిత్రం హిందీతో పాటు తమిళంలో కూడా రీమేక్ అవుతోంది. తమిళంలో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన తమిళ రీమేక్ వర్మ ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. యంగ్ డాక్టర్ గా ధృవ్ అదరగొడుతున్నాడు. బోల్డ్ కంటెంట్ తో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.
అర్జున్ రెడ్డి చిత్రంలో యువతని మెప్పించే అంశాలు మెండుగా ఉన్నాయి. అందుకే తమిళ, హిందీ నిర్మాతలు ఎగబడి మరీఈ చిత్ర రీమేక్ హక్కులని సొంతం చేసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం షాహిద్ కపూర్, కైరా అద్వానీ ఇద్దరూ రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కైరా అద్వానీ లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో నటించి సంచలనం రేపింది.