ముందుగా అనుకున్నట్టు మహానాయకుడు ఫిబ్రవరి 8 కి సినిమా రావట్లేదు అనే న్యూస్ కన్ఫర్మ్ అయ్యింది.కథానాయకుడు లో జరిగిన తప్పులు విశ్లేషించుకుని వాటిని మహానాయకుడు విషయంలో రిపీట్ కాకుండా చూసుకోవడానికి ఇలా సినిమాని పోస్ట్ పోన్ చేసారు.మహానాయకుడు సినిమాకి కీలకం అయిన చైతన్యరథం ఎపిసోడ్స్ ని మళ్ళీ షూట్ చేస్తున్నారు.అలాగే ఈసారి సినిమా లెంగ్త్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.కథానాయకుడు విషయంలో బాలయ్య మాటకి విలువనిచ్చి కాస్త కాంప్రమైజ్ అయ్యాడు క్రిష్.రిజల్ట్ తేడా కొట్టెయ్యడంతో మహానాయకుడు విషయంలో కామ్ గా ఉండిపోయాడు బాలయ్య. అయితే ఎన్టీఆర్ జీవితలో కీలకమయిన మలుపులు,ఆసక్తికర సన్నివేశాలు,మనసు మెలితిప్పే ఎమోషన్స్ అన్నీ కూడా సెకండ్ పార్ట్ లోనే ఉన్నాయి.అందుకే కాస్త లేట్ అయినా కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరీ మహానాయకుడు సినిమాని ఫిబ్రవరి 15 న మహాయకుడు ని రిలీజ్ చెయ్యడానికి ఫిక్స్ అయ్యారు.కథానాయకుడు సినిమాని అధిక ధరలకు కొని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కే ఈ సినిమాని కూడా ఇస్తున్నారు.కథానాయకుడు మిగిల్చిన ;ఓటుని మహానాయకుడు తీరుస్తాడు అని నమ్మకంగా ఉన్నారు వాళ్లంతా.