ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశ సరిహద్దుల్లో గోపీచంద్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 21, 2019, 07:14 PM



యాక్షన్ హీరో గోపీచంద్.. ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా షూటింగ్ సోమవారం ఇండియా-పాకిస్థాన్ బోర్డర్ జైసల్మేర్ లో ప్రారంభమయ్యింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ భారీ ఫైట్ సీక్వెన్స్ తో మొదలవగా, యాక్షన్ డైరెక్టర్ సెల్వన్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తున్నారు.

యాభై రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో రాజస్థాన్, న్యూ ఢిల్లీ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరపనున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా, వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై ప్రొడక్షన్ నెంబర్ 18 గా అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా మే లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..

ఈ సినిమాకి సాంకేతిక నిపుణులు : కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం: తిరు, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి, రచయిత: అబ్బూరి రవి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com