సాయిదేవ రామన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మళ్లి మళ్లి చూశా’.కొణఇదెన కోటేశ్వరరావు నిర్మాత. అనురాగ్ కొణిదెన హీరోగా పరిచయం అవుతున్నారు. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ను ప్రముఖ నిర్మాత డి.సురేష్బాబు విడుదల చేశారు. ”టీజర్ చాలా కొత్తగా ఉందని, కంటెంట్ యువతకు బాగా చేరువయ్యేలా ఉంది” అని ఈ సందర్భంగా సురేష్ బాబు చెప్పారు. ”హీరోగా పరిచయం అవుతున్న అనురాగ్ మంచి భవిష్యత్తు ఉంటుందని” అభినందించారు.
చిత్ర దర్శకుడు సాయిదేవ రామన్ మాట్లాడుతూ ప్రకృతి సృష్టించిన ప్రేమకథ మా సినిమా అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ ”మా సినిమా కంటెంట్ నచ్చి టీజర్ విడుదల చేసిన డి.సురేష్బాబుగారికి ధన్యవాదాలు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియోను, సినిమాను విడుదల చేస్తాం” అని తెలిపారు. ”కంటెంట్ ఓరియంటెడ్ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉందని చిత్ర కథానాయకుడు అనురాగ్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో ఈటీవీ ప్రభాకర్, టిఎన్ఆర్, మిర్చి కిరణ్, అప్పాజీ, బ్యాంక్ శీను, మధుమణి, పావని ప్రభావతి, జయలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. సంగీతం శ్రవణ్ భరద్వాజ్, ఛాయాగ్రహణం సతీష్ ముత్యాల.