నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు "వీరసింహారెడ్డి" రూపంలో మరిచిపోలేని బ్లాక్ బస్టర్ ని ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని. సంక్రాంతి కానుకగా విడుదలైన ఆ సినిమా మంచి విజయం సాధించింది.
తాజాగా గోపీచంద్ తన సొంతూరు ప్రకాశం జిల్లాలోని బొద్దులూరివారి పాలెం లో సొంత డబ్బులతో బస్సు షెల్టర్ ని నిర్మించి, ఊరిపట్ల తనకున్న ఉదారతను చాటుకున్నారు. దీంతో ఊరివారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన పనికి పలువురు అభినందిస్తున్నారు.