ఈ ఏడాది మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18వ తేదీన విడుదలైన కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం "వినరో భాగ్యము విష్ణుకథ". ఈ సినిమాకు మురళి కిషోర్ అబ్బూరు డైరెక్టర్ కాగా, కాశ్మీర పరదేశీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు . మురళి శర్మ కీరోల్ లో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
తాజాగా ఈ సినిమా నుండి 'ఓహ్ బంగారం' ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. హీరో హీరోయిన్ల మధ్య క్యూట్ క్యూట్ గా సాగే ప్రేమగీతంగా చిత్రీకరింపబడిన ఈ పాటను కపిల్ కపిలన్ ఆలపించగా, భాస్కరభట్ల సాహిత్యం అందించారు.