టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి చాన్నాళ్ల తరవాత వెండితెరపై కనిపించబోతున్న చిత్రం "మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి". నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు పి. మహేష్ బాబు దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది.
చాన్నాళ్ల నుండి సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా నో నో నో అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల కాగా, దానికి ఆడియన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. రథన్ స్వరపరిచిన ఈ ఎలెక్ట్రిఫయింగ్ సాంగ్ ను మానసి ఆలపించారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ మ్యూజిక్ వీడియోస్ లో టాప్ ట్రెండింగ్లో దూసుకుపోతుంది.